Saturday 4th April 2026
12:07:03 PM
Home > తాజా > మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రభంజనం!

మున్సిపల్ ఎన్నికల్లో కవిత ప్రభంజనం!

All India Forward Bloc Wins Municipality in Telangana | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలన విజయం నమోదైంది. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీఆరెస్ సైతం పోటీ ఇస్తుంది. అయితే ప్రధాన పార్టీలను ఢీ కొట్టి ఆ అభ్యర్థులను ఓడించి జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో 8 చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్, బీఆరెస్ కేవలం ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయ్యాయి.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో చర్చలు జరిపారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వడ్డేపల్లిలో కీలక నేత అయిన శ్రీను కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. అనంతరం సింహం గుర్తుపై జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేశారు. తాజగా వెలువడిన ఫలితాల్లో ఎనమిది చోట్ల విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions