- తుమ్మన్పేట విద్యార్థులకు స్కాలర్షిప్లు!
Vijay Deverakonda Rashmika Thummanpet Visit | టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు (విరోష్) తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
విజయ్ దేవరకొండ తండ్రి జన్మస్థలమైన నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్పేట్ గ్రామానికి ఈ దంపతులు ఆదివారం చేరుకున్నారు.
ఫిబ్రవరి నెలలో వివాహం జరిగిన తర్వాత ఈ జంట తుమ్మన్పేటకు వెళ్లడం ఇది రెండవసారి. ఆ సమయంలో స్థానిక విద్యార్థుల భవిష్యత్తు కోసం విజయ్ దేవరకొండ చేసిన ఒక కీలక ప్రకటనను నెరవేర్చేందుకు ఈ తాజా పర్యటన చేపట్టారు.
ప్రతిభావంతులైన 180 మంది విద్యార్థులకు భరోసా..
గత పర్యటనలో అచ్చంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 9, 10 తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు (Scholarships) అందిస్తామని విజయ్ దేవరకొండ ప్రకటించారు. (Vijay Deverakonda Rashmika Thummanpet Visit) ఆ వాగ్దానాన్ని నిజం చేస్తూ, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసేందుకు ఈ ఆదివారం రష్మికతో కలిసి ఆయన తుమ్మన్పేట వెళ్లారు.
అచ్చంపేట మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థుల వివరాలను విజయ్ అధికారికంగా వెల్లడించారు. ఈ 180 మంది విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో తల్లిదండ్రులు గర్వపడేలా చేశారని విజయ్ దేవరకొండ అభినందించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్..
తుమ్మన్పేట పర్యటనకు సంబంధించి విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన తండ్రి జన్మించిన ఊరు తుమ్మన్పేటకు రష్మికతో కలిసి బయలుదేరుతున్నట్లు ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోను ఆయన అభిమానులతో పంచుకున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం స్వగ్రామానికి చేరుకుని, ప్రభుత్వ పాఠశాలల పిల్లల చదువుకు అండగా నిలిచిన ఈ స్టార్ దంపతులపై నెటిజన్లు మరియు అచ్చంపేట ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.









