Thursday 15th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ప్రధాని మోదీని తిట్టలేదు’

Cm Revanth Reddy News Latest | తాను ప్రధాని మోదీ ( Pm Modi )ని వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

శనివారం సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )తో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ భేటీలో కులగణన, ఎస్సి వర్గీకరణ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మోదీ పుట్టుకతో బీసీ ( BC ) కాదు అని మాత్రమే తాను అన్నట్లు, మోదీని వ్యక్తిగతంగా తిట్టలేదని సీఎం పేర్కొన్నారు. ప్రధాని పై గౌరవం ఉందన్నారు.

తన మాటలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ( Kishan Reddy ), బండి సంజయ్ ( Bandi Sanjay ) వక్రీకరించారని విమర్శించారు. పుట్టుకతో మోదీ బీసీ కాదు కాబట్టే ఆయనకు బీసీల పట్ల చిత్త శుద్ధి లేదన్నారు. చిత్త శుద్దే ఉంటే జనగనణలో భాగంగా కుల గణన కూడా చేయాలని డిమాండ్ చేశారు.

You may also like
మూడు రోజులుగా హనుమంతుడి చుట్టూ శునకం ప్రదక్షిణలు
ఐదేళ్ల తర్వాత సింహాసనంపై కోహ్లీ
కాసుల వర్షం కురిపిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’
’17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి హరీష్’..కేసీఆర్ పార్టీ రియాక్షన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions