Wednesday 6th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వల్లభనేని వంశీని పరామర్శించనున్న జగన్

వల్లభనేని వంశీని పరామర్శించనున్న జగన్

Ys Jagan To Meet Vallabhaneni Vamshi In Vijayawada Jail | గన్నవరం ( Gannavaram ) మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు.

గన్నవరం టీడీపీ కార్యాలయం ( TDP Office ) పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీకి న్యాయస్థానం రిమాండ్ విధించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో జగన్ మంగళవారం ములాఖత్ లో వంశీని కలవనున్నారు. ఈ మేరకు వైసీపీ ( YSRCP ) ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో విజయవాడ గాంధీ నగర్ లోని జిల్లా జైలులో జగన్ వంశీని పరామర్శించనున్నారు.

కాగా అక్రమ కేసులో వంశీని అరెస్ట్ చేశారని కూటమి ప్రభుత్వం పై వైసీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions