Friday 17th April 2026
12:07:03 PM
Home > తాజా > ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణం ఏంటంటే!

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణం ఏంటంటే!

allu arjun gets interim bail

Allu Arjun Visits Delhi High Court | పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మెట్లు ఎక్కారు.

ప్రస్తుతం దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాపై అంచనాలు పెరుగుతున్న తరుణంలో, తన గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వాడుకోకుండా అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు.

అల్లు అర్జున్ ఆందోళన ఏంటి? డిజిటల్ యుగంలో, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల గొంతును, రూపాన్ని (Deepfakes) దుర్వినియోగం చేయడం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలోనే తన అనుమతి లేకుండా తన పేరు లేదా ఫోటోలను వాణిజ్య ప్రకటనలకు, మర్చండైజ్ (T-shirts, Posters) అమ్మకాలకు వాడుకోవడంపై బన్నీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏఐ సాంకేతికతతో తన వాయిస్ లేదా రూపాన్ని రీ-క్రియేట్ చేసి తప్పుడు వీడియోలు సృష్టించే ప్రమాదం ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అనధికారిక ప్లాట్‌ఫాంలు తన ఇమేజ్‌ను వాడటం వల్ల తన బ్రాండ్ వాల్యూ తగ్గడమే కాకుండా, అభిమానులు మోసపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రెండ్‌గా మారుతున్న లీగల్ ప్రొటెక్షన్..
కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు, ఇటీవల టాలీవుడ్ నుంచి నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇవే హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి ‘జాన్ డో’ (John Doe) ఉత్తర్వులను పొందారు.

అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా తమ పర్సనాలిటీ రైట్స్ కాపాడుకోవడంలో ముందున్నారు.

రాకా మూవీ అప్‌డేట్..
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే బన్నీ ఇలాంటి చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.

You may also like
peddi
రామ్ చరణ్ పెద్ది విడుదల వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions