Thursday 16th July 2026
12:07:03 PM
Home > తాజా > Hyd మెట్రో రద్దీకి చెక్.. అదనపు కోచ్‌ల సేకరణకు HMRL సన్నాహాలు!

Hyd మెట్రో రద్దీకి చెక్.. అదనపు కోచ్‌ల సేకరణకు HMRL సన్నాహాలు!

Metro

Hyd Metro Additional Coaches Procurement | నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు కీలక అడుగులు వేస్తోంది.

ముఖ్యంగా ఐటీ కారిడార్ మరియు ప్రధాన జంక్షన్ల పరిధిలోని అమీర్‌పేట్, మియాపూర్, రైదుర్గ్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లలో నిరంతరం పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీకి పరిష్కారం కనుగొనడంపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా మెట్రో రైళ్లకు మరిన్ని అదనపు కోచ్‌లను సేకరించాలని అధికారులు యోచిస్తున్నారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి మెట్రో సేవలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

అత్యధికంగా ప్రయాణీకులు ఉండే ఈ కీలక స్టేషన్లలో రద్దీని తక్షణమే అదుపు చేసేందుకు గానూ, కొత్త కోచ్‌ల సరఫరా విషయమై తయారీదారులతో వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

లాస్ట్-మైల్ కనెక్టివిటీ, స్కైవాక్‌ల విస్తరణ..

మెట్రో స్టేషన్ల వెలుపల ప్రయాణీకులు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను కూడా ఈ సమీక్షలో ప్రధానంగా ప్రస్తావించారు.

ప్రయాణీకులకు సులభమైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు (లాస్ట్-మైల్ ట్రాన్సిట్) ఇప్పటికే ఉన్న ఫీడర్ సేవలను విస్తరించాలని, ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (TGSRTC) మరియు రవాణా శాఖతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అజిత్ రెడ్డి సూచించారు.

 69 కిలోమీటర్ల మేర ఉన్న ఫేజ్-1 మార్గంలో ప్రయాణ రద్దీని సులభతరం చేసేందుకు కొత్త అభివృద్ధి ప్రణాళికల అవసరాన్ని సుభాన్ బేకరీ రెడ్డి నొక్కి చెప్పారు.

మెట్రో స్టేషన్లలో పాదచారుల రాకపోకలను మెరుగుపరిచేందుకు స్థానిక కార్యాచరణ ప్రణాళికలను మొదట ఎంపిక చేసిన కొన్ని స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టులుగా పరీక్షించనున్నారు.

ప్రస్తుత స్కైవాక్‌లను నిర్వహించడంతో పాటు, ప్రధాన రైల్వే టెర్మినళ్లు-మెట్రో స్టేషన్ల మధ్య అనుసంధాన మార్గాల ఏర్పాటుపై రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు.

విస్తరణకు రూ. 2,500 కోట్లు కేటాయింపు..

హైదరాబాద్ ప్రజల జీవనాడిగా మారిన మెట్రో రైలు మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని న్యూస్ మీటర్ నివేదిక వెల్లడించింది. నగరంలో మెట్రో విస్తరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 2,500 కోట్లను కేటాయించింది.

హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ప్రయాణీకుల సేవలు, భద్రతా ప్రమాణాలు, స్టేషన్ల పరిశుభ్రత మరియు రద్దీ నిర్వహణ వ్యూహాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.

భద్రతా విభాగం కూడా ప్రయాణీకుల రక్షణ చర్యలపై సమీక్షలో ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చింది. ఐటీ మరియు ఆర్థిక కేంద్రాలైన హైటెక్ సిటీ, రైదుర్గ్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ ప్రాంతాల కోసం ఉద్దేశించిన పబ్లిక్ రాపిడ్ ట్రాస్నిట్ సిస్టమ్ (PRTS) ప్రతిపాదనల పురోగతిని కూడా అధికారులు ఈ సందర్భంగా సమీక్షించారు.

You may also like
హైదరాబాద్-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్!
అమీర్‌పేట్ మెట్రో పిల్లర్‌కు పగుళ్లు? రూమర్లపై మెట్రో రైల్ ఎండి క్లారిటీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions