Saturday 30th May 2026
12:07:03 PM
Home > క్రీడలు > కుప్పకూలిన టీం ఇండియా..కరుణ్ నాయర్ సెన్సేషనల్ పోస్ట్

కుప్పకూలిన టీం ఇండియా..కరుణ్ నాయర్ సెన్సేషనల్ పోస్ట్

Karun Nair’s Cryptic Post Amid India’s Collapse Goes Viral | సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో టీం ఇండియా ఆటగాళ్లు తెలిపోయారు. ఇదే సమయంలో క్రికెటర్ కరుణ్ నాయర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నాయర్ చేసిన నిగూఢమైన పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా రెండవ టెస్టు కొనసాగుతుంది.

సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 489 పరుగులు చేసింది. అయితే టీం ఇండియా మాత్రం కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. జైస్వాల్ 58 పరుగులు చేయగా, వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు, బౌలర్ కుల్దీప్ యాదవ్ 134 బంతులు ఆడి 19 పరుగులు చేసి టీం ఇండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇదే సమయంలో ఎక్స్ వేదికగా కరుణ్ నాయర్ చేసిన నిగూఢమైన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

‘కొన్ని పరిస్థితులు హృదయంలో లోతుగా పాతుకుపోయిన భావనను గుర్తుచేస్తాయి. అదే సమయంలో మనం అక్కడ లేము అనే నిశ్శబ్దం మరికొంత బాధను జోడిస్తుంది’ అని నాయర్ పేర్కొన్నారు. టీం ఇండియా కుప్పకూలిన సమయంలో తాను ఎంపిక కాకపోవడంపై నాయర్ నిరాశను వ్యక్తం చేస్తున్నారని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions