Maoists Mainstream Politics | మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ అలియాస్ ఎలియస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఇటీవలే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెల్సిందే.
ఈ తరుణంలో వారు రాజకీయాల్లో వస్తారని తెలుస్తోంది. అయితే ఓ ప్రధాన పార్టీలో వీరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు ఏ పార్టీలో అయిన చేరొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చి ఏ రాజకీయ పార్టీలో చేరుతారో అన్నది వాళ్ళ ఇష్టం అని పేర్కొన్నారు.
రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. దేశ వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని వెల్లడించారు.









