Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రజినీ..ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ మెంట్!

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రజినీ..ఆ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ మెంట్!

Rajinikanth announces Sequel for his Iconic Film | సూపర్ స్టార్ రజినీ కాంత్ సినీ కెరీర్ లో నరసింహ సినిమాది చాలా ప్రత్యేక స్థానం. ఆ సినిమాలో నరసింహ గా రజినీకాంత్, నీలాంబరి గా రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి రజినీకాంత్ కీలక ప్రకటన చేశారు. ‘నరసింహ’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన నరసింహ సినిమాకు స్వయంగా రజినీకాంత్ కథను రాశారు.

1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పాత రికార్డులను వెనక్కు నెట్టేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇందులో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. కాగా డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు. ఈ క్రమంలో నరసింహ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో నరసింహ సినిమా విశేషాలను పంచుకున్నారు.

తొలుత నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ ఆ తర్వాత మాధురి దీక్షిత్ వంటి హీరోయిన్లను అనుకున్నట్లు కానీ పాత్రకు రమ్యకృష్ణ అయితేనే న్యాయం చేయగలదని తుది నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. రోబో 2.0, జైలర్ 2 చేస్తున్నప్పుడు తనకు నరసింహ-2 ఎందుకు తీయకూడదు అని ఆలోచన వచ్చినట్లు రజిని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీక్వెల్ కు సిద్ధం అయినట్లు చెప్పారు. ‘నీలాంబరి’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతున్నట్లు రజిని ప్రకటించారు. దీనికి సంబంధించిన కథపై ప్రస్తుతం వర్క్ నడుస్తున్నట్లు సూపర్ స్టార్ కీలక అప్డేట్ ఇచ్చారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions