Thursday 6th August 2026
12:07:03 PM
Home > తాజా > పాశమైలారంలో తీవ్ర విషాదం..కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు!

పాశమైలారంలో తీవ్ర విషాదం..కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు!

Pashamylaram reactor blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది.

సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ పేలుడుతో ప్రొడక్షన్ యూనిట్ ఉన్న భవనం కూలిపోయింది. మరో భవనానికి బీటలు వచ్చాయి.

ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో 10 మృతిచెందినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్, ఇస్నాపూర్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.

చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions