Saturday 8th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కళ్యాణ్ కోర్టుకు రావాలి.. షాకిచ్చిన హైదరాబాద్ సిటీ కోర్టు

పవన్ కళ్యాణ్ కోర్టుకు రావాలి.. షాకిచ్చిన హైదరాబాద్ సిటీ కోర్టు

Hyderabad City Civil Court On Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) కు ఊహించని షాక్ ఎదురైంది. తిరుమల లడ్డూ ( Tirumala Laddoo ) లో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది రామారావు హైదరాబాద్ సిటీ కోర్టు ( Hyderabad City Civil Court )లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా, ఏపీ ప్రభుత్వం తిరుమల లడ్డులను పంపించిన విషయం తెల్సిందే.

అయితే అయోధ్యకు పంపిన లడ్డూలో కూడా జంతు కొవ్వును వాడారని డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతీశేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు.

సదరు వీడియోలను సోషల్ మీడియా ( Social Media ) నుండి తొలగించాలని కోరారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారి ( CS Shantikumari )కి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions