No Insurance No Fuel Policy | దేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ (మూడో పక్ష బీమా) లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిరాకరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఈ మేరకు “నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్” (No Insurance, No Fuel) విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
సగానికి పైగా వాహనాలకు బీమా లేదు!
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. దేశంలో సగానికి పైగా వాహనాలు మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా, సరైన బీమా రక్షణ లేకుండానే రోడ్లపై నడుస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అత్యంత ఆందోళనకరంగా మారిన ఈ సమస్యను అధిగమించేందుకు ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’ విధానం ఒక అత్యుత్తమ మార్గమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
ఇన్సూరెన్స్ లేని వాహనాలను సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. యాజమానులకు హెచ్చరిక: వాహన యజమానులకు తమ ఇన్సూరెన్స్ గడువు ముగిసిందనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేసినట్లు అవుతుంది.
టోల్ ప్లాజాలు, హైవేలపై పైలట్ ప్రాజెక్ట్..
ఈ ప్రతిపాదిత విధానాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ముఖ్యంగా జాతీయ రహదారులు (National Highways), తరచుగా ప్రమాదాలు జరిగే బ్లాక్ ஸ்பాట్లు, మరియు టోల్ ప్లాజాల వద్ద ఈ పైలట్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని సూచించింది.











