Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం సమీక్ష

మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సీఎం సమీక్ష

Revanth Reddy Reviews Medaram and Basara Temples Development Works | తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన మేడారం, బాసర ఆలయాలపై సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

రెండు ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. జంపన్న వాగులో నీరు నిలిచేలా చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి సమీక్ష చేసిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.

దేవాలయాల అభివృద్ధిలో స్థానిక సెంటిమెంట్లు, స్థానిక పెద్దలు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions