Sunday 2nd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మెగాఫ్యామిలీలో చిరంజీవి తర్వాత నాగబాబు?..పవన్ మంతనాలు

మెగాఫ్యామిలీలో చిరంజీవి తర్వాత నాగబాబు?..పవన్ మంతనాలు

Rajyasabha Seat For Nagababu ?| జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ( Mega Brother Nagababu )కు సంబంధించి ఒక వార్తా ఆసక్తిని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో కూటమిలో భాగంగా ఇందులో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో నాగబాబును రాజ్యసభకు పంపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం తో ఇదే విషయంపై చర్చినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ నాగబాబు రాజ్యసభకు ఎంపికైతే మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) తర్వాత ఆ ఫ్యామిలీలో ఈ ఘనత సాధించిన రెండవ వ్యక్తిగా ఆయన నిలుస్తారు.

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, 2009 ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేసి 18 శాతం ఓట్లను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి కేంద్రమంత్రిగా సేవలందించారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions