Friday 4th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘మోదీజీ పాకిస్థాన్ వెళ్లి ఆ ఉగ్రవాదుల్ని తీసుకురండి’

‘మోదీజీ పాకిస్థాన్ వెళ్లి ఆ ఉగ్రవాదుల్ని తీసుకురండి’

Owaisi urges Modi to bring 26/11 masterminds from Pakistan | హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాకిస్థాన్ కు సైన్యాన్ని పంపి ముంబయిలో 26/11 ఉగ్రదాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ను పట్టుకురావలని డిమాండ్ చేశారు. తాజగా అమెరికా సైన్యం వెనెజువెలా దేశంపై సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నోకొలస్ మధురోను మరియు ఆయన భార్యను బంధించి అమెరికా తీసుకెళ్లిన విషయం తెల్సిందే.

ఈ ఘటనను ప్రస్తావించిన ఒవైసీ ప్రధాని మోదీ కూడా పాకిస్థాన్ లో నక్కిన ఉగ్రవాదులపై ఇలాంటి చర్య తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముంబయి లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబయి నగరంలో ఉగ్ర కుట్ర పన్నిన క్రూరులు మసూద్ అజర్ అయినా సరే లేదా లష్కరే తోయిబా అయినా పాకిస్థాన్ నుంచి ఈ ముష్కరులను ఎందుకు తీసుకురాకూడదు అని అడిగారు. తనది 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకునే మోదీ సైన్యాన్ని పంపి ఉగ్రవాదులను ఎందుకు తీసుకురారు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions