Sanjay Raut | శివసేన (Shiv Sena) ఉద్ధవ్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు కపిల్ దేవ్ (Kapil Dev) ను పిలవకుండా అవమానించారని విమర్శించారు సంజయ్ రౌత్.
బీజేపీ ఒత్తిడి కారణంగానే బీసీసీఐ (BCCI) కపిల్ దేవ్ ను ఆహ్వానించలేదని ఎందుకంటే గతంలో బీజేపీ ఎంపీకి వ్యతిరేకంగా ఢిల్లీ లో మహిళా రెజ్లర్లు చేసిన ధర్నాకు కపిల్ దేవ్ మద్దతు తెలిపారన్నారు సంజయ్ రౌత్.
అందుకోసమే ఆయన్ను ఫైనల్ మ్యాచ్ కు పిలవకుండా బీజేపీ, బీసీసీఐ, ఐసీసీ (ICC) కపిల్ దేవ్ ను అవమానించారని ధ్వజమెత్తారు.
ప్రధాన మోదీ (Narendra Modi) ని డామినేట్ చేస్తారనే కపిల్ దేవ్ ని ఫైనల్ మ్యాచ్ కు పిలవలేదని ఆగ్రహించారు.
అంతేకాకుండా గుజరాత్ బీజేపీ లాబి మూలంగానే వరల్డ కప్ ఫైనల్ మ్యాచ్ ముంబై (Mumbai) నుండి అహ్మదాబాద్ కు తరలిపోయిందని ఆరోపించారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.