Monday 19th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడు: బీజేపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు!

పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడు: బీజేపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు!

sambit patra

Sambit Patra | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నేత, ఆ పార్టీ పూరి లోక్సభ అభ్యర్థి సంబిత్ పాత్ర (Sambit Patra) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

ఈ వివాదం నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరిన ఈ నేత, ప్రాయశ్చిత్తంగా మూడు రోజుల ఉపవాస దీక్షకు పూనుకున్నారు.

కాగా ఇటీవల ప్రధాని మోదీ ఒడిశా లోని పూరి లో పర్యటించారు. ఈ సందర్భంగా సంబిత్ పాత్ర పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ పూరి జగన్నాథుడు ప్రధాని మోదీ భక్తుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దింతో ఈ వ్యాఖ్యలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు.

జగన్నాథుడు విశ్వానికి ప్రభువు. అలాంటి ప్రభువును కించపరిచే విదంగా వ్యాఖ్యానించడమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్నాథుడు భక్తులను, ఒడిశా ప్రజల మనోభావాలను దెబ్బ తీసిందని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తాను నోరు జారీ ఇలాంటి వ్యాఖ్యలు చేసానని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చారు. జగన్నాథుడి భక్తుడు ప్రధాని మోదీ అని చెప్పబోయి నోరిజరినట్లు క్లారిటీ ఇచ్చారు.

You may also like
kangana ranaut
ఇంటి కరెంట్ బిల్ చూసి షాకైన నటి!
Mandipattu-Kishan Reddy on the government saying that it has written down the tradition of the legislative assembly
బీజేపీపై విషం కక్కడమే వాళ్ల ఎజెండా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్.. నోటీసులు ఇచ్చిన అసెంబ్లీ కార్యదర్శి!
maharashtra new cm
మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్స్ కు తెర.. నెక్స్ట్ సీఎం ఎవరంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions