Friday 31st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్!

విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్!

kishan reddy slams tg assembly speaker

Kishan Reddy | విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణి ప్రైవేటీకరణ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పెండింగ్ లో ఉందన్నారు.

ఆ ఫైల్ పెండింగ్ లో ఉందని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్లే అని భరోసా ఇచ్చారు. దింతో కార్మికులు, ఆంధ్రా ప్రజలు ఎవరు ఆందోళన చెందొద్దన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినా, దాన్ని కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ఏవి కనిపించడం లేదన్నారు.

సింగరేణి ప్రైవేటీకరణ అనే అంశమే లేదని హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం మాజీ కేసీఆర్ ఈ అంశంపై విషప్రచారం చేశారు తప్ప, ఈ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions