Saturday 27th July 2024
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ పై పోలీసులకు పిర్యాదు…!

కేసీఆర్ పై పోలీసులకు పిర్యాదు…!

Police complaint against cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) పైన భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొడెం వీరయ్య (podem veeraiah) పోలీసులకు పిర్యాదు చేశారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలని సీఎం కేసీఆర్ మోసగించడాని వీరయ్య ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు పిర్యాదు చేస్తున్నట్లు వీరయ్య పేర్కొన్నారు.

cong mla veeraiah fires on kcr| గతంలో భద్రాచల ఆలయానికి రూ.100 కోట్లు హామీ ఇచ్చి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చెయ్యలేదని ఎమ్మెల్యే తెలిపారు.

గత ఏడాది వరదల సమయంలో భద్రాచలం పట్టణాన్నీ పర్యవేక్షించేయందుకు వచ్చిన ముఖ్యమంత్రి ఎత్తిపోతల పటిష్టం, ఎత్తు పెంపుదల, ముంపునకు గురైన కాలనీల ప్రజలకు పునరావాసం కోసం రూ. 1000 కోట్ల నిధులను విడుదల చేస్తానని ప్రకటించారు.

కానీ నిధులు ఇప్పటి వరకు మంజూరు కాలేదని వీరయ్య అన్నారు. ఈ ఏడాది కూడా వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంది, మరి ఈ ఏడాది కూడా ప్రజలు గోదావరి వరదల్లో మునగాల్సిందేనా? అని ఆయన ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని సోమవారం భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మధుప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

You may also like
kcr
Big Breaking కేసీఆర్ ఓటమి.. కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం!
kcr news
‘ఆ చార్జీలు పూర్తిగా రద్దు చేస్తాం..’ సీఎం కేసీఆర్ తీపి కబురు..!
kcr
కేసీఆర్ కు రూ.1.06 కోట్లు అప్పిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి!
kcr news
ఆంధ్రా రోడ్లపై మరోసారి కామెంట్లు చేసిన కేసీఆర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions