Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > శశికళ అప్పిల్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు

శశికళ అప్పిల్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు

Madras High Court rejects Sasikala's appeal

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నే హితురాలు వీకే శశికళకు.. మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కా లిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్క రించింది. జస్టిస్‌ ఆర్‌ సుబ్రమణియన్‌, ఎన్‌. సెంథిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆ కేసులో తీర్పును ఇచ్చింది. 2022లో శశికళ దాఖలు చేసిన మూడు అప్పీల్స్‌ను బెంచ్‌ తిరస్కరించింది. మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత 2016, డిసెంబర్‌ 29వ తేదీన అన్నాడీఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీగా శశికళను నియమించారు. ఆ తర్వాత జరిగిన పరి ణామాల్లో ఆమెను తొలగించారు. అయితే ఆ పోస్టులో తననే ప్రకటించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions