Thursday 15th January 2026
12:07:03 PM
Home > తాజా > ప్రభాస్ ను చూసి ఏడ్చేసిన మారుతి..రెబల్ స్టార్ ఏం చేశారంటే!

ప్రభాస్ ను చూసి ఏడ్చేసిన మారుతి..రెబల్ స్టార్ ఏం చేశారంటే!

Director Maruthi Emotional Speech at The Raja Saab – Pre Release | రెబల్ స్టార్ ప్రభాస్ ను చూసి, సినిమా కోసం ఆయన పడిన శ్రమను గుర్తుచేసుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు దర్శకుడు మారుతి. ప్రభాస్, మారుతీ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ది రాజాసాబ్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో శనివారం రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ..తన లాంటి మీడియం రేంజ్ దర్శకుడిని కూడా రెబల్ యూనివర్సిటీలో చేర్చుకుని ఈ స్థాయిలో నిలబెట్టారని భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సినిమా కోసం ప్రభాస్ జీవితాన్ని పెట్టేశారు అని పేర్కొన్నారు. ప్రభాస్ కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపిన ఆయన..రెబల్ స్టార్ ను చూస్తూ ‘మీరు ఎదురుగా ఉంటే నా వల్ల కాదు సర్’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వెంటనే ప్రభాస్ వేధికపైకి వెళ్లి ఓదార్చారు. ఇకపోతే అభిమానులను రాజాసాబ్ సినిమా ఒక్క శాతం కూడా నిరాశ పరచదని అలా జరిగితే తన ఇంటికి వచ్చి అడగాలన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తన ఇంటి అడ్రెస్ ను కూడా ఇచ్చారు.

You may also like
మూడు రోజులుగా హనుమంతుడి చుట్టూ శునకం ప్రదక్షిణలు
ఐదేళ్ల తర్వాత సింహాసనంపై కోహ్లీ
కాసుల వర్షం కురిపిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’
’17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి హరీష్’..కేసీఆర్ పార్టీ రియాక్షన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions