Wednesday 29th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..!

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..!

  • మూజువాణి ఓటుతో గ్రీన్ సిగ్నల్

Anti Paper Leak Bill | దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్-యూజీ పేపర్ లీక్ ఘటనల అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టడం, పేపర్ లీక్‌లు, మోసాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో పలు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఈ బిల్లుకు ముందు దేశవ్యాప్తంగా నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. జంతర్ మంతర్ వేదికగా నెలరోజులకు పైగా నిరసనలు కొనసాగగా, అనంతరం అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

ఆ పరిణామాల తర్వాత పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. లోక్‌సభ ఆమోదంతో బిల్లు తదుపరి పార్లమెంటరీ ప్రక్రియలో ముందుకు సాగనుంది.

You may also like
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
vijay swearing in ceremony
మూడు రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై తమిళనాడు నిషేధం!
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions