Tuesday 9th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం భరోసా!

విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం భరోసా!

‌- కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ పర్యటన..
– గాయపడిన వారికి ₹10 లక్షల సాయం..
– ఉక్కు ప్రమాద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం!

Pawan Kalyan Visits Vizag Steel Plant Victims | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.

ఈ భయంకర దుర్ఘటనలో గాయపడి, విశాఖలోని కిమ్స్ ఐకాన్ (KIMS ICON) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా సందర్శించి పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.

భారీ పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..
ఉక్కు ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, తీరని లోటని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఆయన కీలక వరాలు ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు సాయం..
ప్రమాదంలో మరణించిన ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున భారీ ఆర్థిక పరిహారాన్ని ప్రకటించారు. ఆర్థిక సాయంతో పాటు, మృతుల కుటుంబాల్లోని ఒక సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

గాయపడిన వారికి చికిత్స, సాయం..
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికులకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని, వారికి మెరుగైన వైద్యం ఉచితంగా అందేలా చూస్తామని స్పష్టం చేశారు.

అసలు సోమవారం ఏం జరిగిందంటే..?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం కార్మికులు విధుల్లో ఉండగా ఊహించని విపత్తు సంభవించింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (SMS-2) యూనిట్‌లో కార్మికులు పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సుమారు 1,500 డిగ్రీల విపరీతమైన వేడితో కూడిన ఉక్కుద్రవం (Molten Metal) ఉన్న ల్యాడిల్ నుండి బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. దాంతో ల్యాడిల్ నుండి ఉక్కుద్రవం ఒక్కసారిగా కిందకు విరజిమ్మడంతో అక్కడ విధుల్లో ఉన్న కార్మికులు ఆ సెగలకు, మంటలకు చిక్కుకుపోయారు.

ఈ దారుణమైన మంటల ధాటికి ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు – సీఎం, హోంమంత్రి పర్యవేక్షణ..
ఘటన జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్‌లతో మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయించారు.

విజయనగరం పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత హుటాహుటిన విశాఖకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి బాధితులను పరామర్శించి, భారీ పరిహారంతో పాటు ఉద్యోగ భరోసా ఇవ్వడంతో నష్టపోయిన కుటుంబాల్లో కాస్త ధీమా వ్యక్తమవుతోంది.

You may also like
విశాఖ వీధుల్లో సైకిల్‌పై సీఎం చంద్రబాబు హంగామా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions