Sunday 23rd August 2026
12:07:03 PM
Home > తాజా > మహిళ చనిపోయిందని చెప్పినా..అల్లు అర్జున్ పై ఏసీపీ సంచలనం

మహిళ చనిపోయిందని చెప్పినా..అల్లు అర్జున్ పై ఏసీపీ సంచలనం

ACP Ramesh About Allu Arjun | నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్. సంధ్య థియేటర్ వద్ద అసలు ఏం జరిగిందో వివరించారు ఏసీపీ రమేష్ ( ACP Allu Arjun ).

ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని, బాలుడు తీవ్రంగా గాయపడినట్లు అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ కు చెప్పాం. థియేటర్ నుండి వెళ్లిపోవాలని సూచించాం. అయినప్పటికీ మేనేజర్ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు. అతి కష్టం మీద అల్లు అర్జున్ వద్దకు వెళ్లి మహిళ చనిపోయిందని చెప్పగా నేను సినిమా చూశాకే వెళ్తాను అని అల్లు అర్జున్ చెప్పారు. సుమారు 10 నిమిషాల వెయిట్ చేశాక డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ను బయటకు తీసుకొచ్చాము’ అని ఏసీపీ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై విచారణ జరుగుతుందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ( Cv Anand ) పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions