Saturday 23rd May 2026
12:07:03 PM
Home > తాజా > మహిళ చనిపోయిందని చెప్పినా..అల్లు అర్జున్ పై ఏసీపీ సంచలనం

మహిళ చనిపోయిందని చెప్పినా..అల్లు అర్జున్ పై ఏసీపీ సంచలనం

ACP Ramesh About Allu Arjun | నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు చిక్కడపల్లి ఏసీపీ రమేష్. సంధ్య థియేటర్ వద్ద అసలు ఏం జరిగిందో వివరించారు ఏసీపీ రమేష్ ( ACP Allu Arjun ).

ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని, బాలుడు తీవ్రంగా గాయపడినట్లు అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ కు చెప్పాం. థియేటర్ నుండి వెళ్లిపోవాలని సూచించాం. అయినప్పటికీ మేనేజర్ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు. అతి కష్టం మీద అల్లు అర్జున్ వద్దకు వెళ్లి మహిళ చనిపోయిందని చెప్పగా నేను సినిమా చూశాకే వెళ్తాను అని అల్లు అర్జున్ చెప్పారు. సుమారు 10 నిమిషాల వెయిట్ చేశాక డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ను బయటకు తీసుకొచ్చాము’ అని ఏసీపీ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

మరోవైపు సంధ్య థియేటర్ ఘటనపై విచారణ జరుగుతుందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ( Cv Anand ) పేర్కొన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions