- మా ప్రభుత్వం రాగానే రెగ్యులరైజ్ చేస్తాం
- ఫోన్ లో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అరవింద్..
MP Arvind calls suspended RTC driver | తెలంగాణ ప్రజా రవాణా రంగం (TSRTC) లో మరో రాజకీయ దుమారం రేగింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే జగిత్యాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై అధికారులు వేటు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చర్యపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా మండిపడింది.
బాధితుడు అశోక్ కుటుంబానికి బీజేపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు.
మంగళవారం జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి.. బాధితుడు అశోక్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భరోసా..
ఈ సస్పెన్షన్ ఉదంతం తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తక్షణమే స్పందించారు. జగిత్యాల బీజేపీ నాయకుల సహకారంతో డ్రైవర్ అశోక్తో ఆయన సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు.
అశోక్ కుటుంబానికి పార్టీ తరపున, అలాగే తన వ్యక్తిగత పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
“తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. మా ప్రభుత్వం ఏర్పాటు జరిగిన వెంటనే డ్రైవర్ అశోక్ ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా.. అధికారికంగా రెగ్యులరైజ్ (Regularize) చేస్తాం” అని ఎంపీ అరవింద్ ఫోన్ లైన్ లో సంచలన ప్రకటన చేశారు.
ప్రశ్నించే హక్కు ప్రతి సామాన్యుడికి ఉంది..
డాక్టర్ భోగ శ్రావణి అంతకుముందు అశోక్ ను పరామర్శించిన సందర్భంగా జగిత్యాల బీజేపీ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి మీడియాపై అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి సామాన్య పౌరుడికి ఉంటుందని, అలా ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ యాజమాన్యం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా డ్రైవర్ అశోక్ను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.







