Monday 23rd March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పచ్చి సిమెంట్‌పైనే రైల్వే ప్రయాణికుల నడక.. వీడియో వైరల్!

పచ్చి సిమెంట్‌పైనే రైల్వే ప్రయాణికుల నడక.. వీడియో వైరల్!

railway station

Patna Railway Station Viral Video | సాధారణంగా పబ్లిక్ ప్రాపర్టీని పాడుచేస్తే జనం పౌరస్మృతి (Civic Sense) గురించి చర్చ జరుగుతుంది. కానీ బీహార్‌లోని పాట్నా సమీపంలో ఉన్న ఖుష్రుపూర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక ఘటన చూస్తే మాత్రం.. అధికారుల ‘కామన్ సెన్స్’ ఏమైందని నెటిజన్లు మండిపడుతున్నారు.

అసలేం జరిగింది?
ఖుష్రుపూర్ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్లాట్‌ఫారమ్ అంతటా తాజాగా కాంక్రీట్ (Wet Concrete) వేశారు. అయితే, పనులు జరుగుతున్న సమయంలోనే రైలు స్టేషన్‌కు రావడంతో ప్రయాణికులు దిగక తప్పలేదు.

ప్లాట్‌ఫారమ్ మొత్తం పచ్చి సిమెంట్‌తో నిండి ఉండటం, ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో.. ప్రయాణికులందరూ ఆ పచ్చి సిమెంట్‌పైనే నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

నెటిజన్ల ఆగ్రహం..
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “రైలు వచ్చే సమయానికి కాంక్రీట్ వేయాలని ఏ అధికారి ఆలోచించాడు? జనం జెట్ ప్యాక్ వేసుకుని వెళ్లాలా?” అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

రైలును వేరే ప్లాట్‌ఫారమ్ పైకి మళ్లించాల్సింది పోయి, ఇలా పనులను పాడుచేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్లాట్‌ఫారమ్ పాడైపోయినందుకు మళ్ళీ జనాన్నే నిందిస్తారేమోనని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions