Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘మూవీ పైరసీ చేసేవాడితో పాటు చూసేవాన్ని’

‘మూవీ పైరసీ చేసేవాడితో పాటు చూసేవాన్ని’

RGV About Movie Piracy | మూవీ పైరసీ చేసేవాడితో పాటు చూసేవాళ్ళను శిక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇలా చేస్తేనే పైరసీని అరికట్టవచ్చన్నారు. పైరసీ చేసిన సినిమాను చూసే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నంత వరకు ఐ బొమ్మ రవి లాంటి వారు పుట్టుకొస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఐ బొమ్మ రవి మద్దతుదారులు అతన్ని గర్వంగా రాబిన్ హుడ్ తో పోల్చుతున్నారని తెలిపిన ఆర్జీవి రాబిన్ హుడ్ హీరో కాదు, ధనవంతులను దోచుకుని, వారిని హత్య చేసి ఆ డబ్బులను పంచే ఓ ఉగ్రవాది అని అన్నారు.

అయితే ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా టికెట్ రేట్లు పెరిగాయని, పాప్ కార్న్ ధర ఎక్కువయ్యిందని ఇతరత్రా కారణాలతో పైరసీ చేయడం న్యాయమే అంటూ సమర్దించుకుంటున్నారని ఆర్జీవి చెప్పారు. ఈ క్రమంలో పైరసీని కట్టడి చేయాలంటే కేవలం ఐ బొమ్మ రవి లాంటి వ్యక్తులను శిక్షిస్తేనే సరిపోదని, వీక్షకులను సైతం పట్టుకుంటేనే అరికట్టవచ్చన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions