Sunday 20th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తనయుడు అకీరాతో కలిసి..పవన్ దక్షిణాది ఆలయాల పర్యటన

తనయుడు అకీరాతో కలిసి..పవన్ దక్షిణాది ఆలయాల పర్యటన

Pawan Kalyan’s Temple Tour | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) దక్షిణ భారత రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న విషయం తెల్సిందే.

షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మధురై లోని మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పవన్ సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శనివారం ఉదయం మధురై జిల్లాలోని అలగర్ కొండల్లో వల్లి, దేవసేన, గణపతి సమేతంగా నెలవై ఉన్న పలముదిర్చోలై, అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయం దర్శించుకుని, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

పవన్ దక్షిణాది ఆలయాల పర్యటనలో భాగంగా తనయుడు అకీరా నందన్ ( Akira Nandan ) తండ్రి వెంటే ఉంటున్నారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి కూడా డిప్యూటీ సీఎం వెంట ఉన్నారు.

You may also like
‘విమానం దారి మళ్లింపు..ఢిల్లీ విమానాశ్రయం సీఎం పై ఆగ్రహం’
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions