Friday 7th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘వైసీపీ పదవులకు రాజీనామా..2029 లో జగన్ గెలవాలి’

‘వైసీపీ పదవులకు రాజీనామా..2029 లో జగన్ గెలవాలి’

Vijayasai Reddy Latest News | రాజ్యసభ మాజీ సభ్యులు విజయసాయి రెడ్డి జనవరి 25న ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

తాజగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామాను పార్టీ అధ్యక్షులు జగన్ ( Ys Jagan ) కు పంపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

2029 ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నట్లు చెప్పారు.

తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions