Monday 30th March 2026
12:07:03 PM
Home > తాజా > గిరిజన క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క!

గిరిజన క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క!

minister seethakka

Tribal Canteen in Aadilabad | సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఉట్నూర్ ఆధ్వర్యంలో గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన గిరిజన క్యాంటీన్ ను శుక్రవారం రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ , ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక గిరిజన భవన్ లో గిరిజన క్యాంటీన్ లో ప్లేట్ మీల్స్ కేవలం రూ. 5 లకే మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

క్యాంటీన్ ఏర్పాటు చేయడం వలన కొలాం గిరిజనులకు ఉపాధి లభించిందన్నారు. శాశ్వత షెడ్డు నిర్మాణానికి టెండర్ ఖరారు చేయడం జరిగిందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు, తదితరులు పాల్గొన్నారు.

You may also like
seethakka pressmeet
అనాథ బిడ్డల భవిష్యత్తుకు భరోసా!
seethakka launches medaram festival coffee table book
మేడారం జాత‌ర‌పై కాఫీ టేబుల్ బుక్!
seethakka pressmeet
‘జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం’
seethakka
తెలంగాణ మంత్రి సీతక్కకు చేదు అనుభవం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions