Saturday 27th July 2024
12:07:03 PM
Home > తాజా > గిరిజన క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క!

గిరిజన క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క!

minister seethakka

Tribal Canteen in Aadilabad | సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఉట్నూర్ ఆధ్వర్యంలో గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన గిరిజన క్యాంటీన్ ను శుక్రవారం రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళాభివృద్ది , శిశు సంక్షేమ శాఖ , ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక గిరిజన భవన్ లో గిరిజన క్యాంటీన్ లో ప్లేట్ మీల్స్ కేవలం రూ. 5 లకే మధ్యాహ్నం 12.00 గంటల నుండి 2.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

క్యాంటీన్ ఏర్పాటు చేయడం వలన కొలాం గిరిజనులకు ఉపాధి లభించిందన్నారు. శాశ్వత షెడ్డు నిర్మాణానికి టెండర్ ఖరారు చేయడం జరిగిందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు, తదితరులు పాల్గొన్నారు.

You may also like
seethakka ktr
కేటీఆర్ బుద్ధిగా పనిచేయ్: మంత్రి సీతక్క ఫైర్!
నాడు ‘అన్నల’ వెంట.. నేడు ‘రేవంతన్న’ వెంట.. మంత్రిగా సీతక్క ప్రమాణం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions