Seethakka Slams KTR | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై మంత్రి సీతక్క (Seethakka) ఫైర్ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని, వారి అహంకారమే బీఆరెస్ ను ఓడించిందని విమర్శలు గుప్పించారు.
అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని అందుకే విధ్వంసకర రాజకీయాలకు తెర తీస్తున్నారంటు దుయ్యబట్టారు.
గురువారం శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న సీతక్క అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. బీఆరెస్ పాలనలో లక్షల కోట్ల అప్పులు చేసి విలాసవంతమైన జీవితాన్ని గడిపారని, గడిలా పాలన చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదని గుర్తుచేశారు. అలాగే ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారని పేర్కొన్నారు. సర్పంచులు బిల్లులను పెండింగ్ లో పెట్టి, నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
అంతేకాకుండా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తే కేటీఆర్ జీర్ణించికోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కేటీఆర్ కు బుద్ధి ఉందా అంటూ ప్రశ్నించారు. ఇకనైనా కేటీఆర్ ప్రతిపక్ష హోదాలో బుద్దిగా పనిచేయాలని హితవుపలికారు.











