Sunday 20th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఏడాదిలో రెండుసార్లు టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్!

ఏడాదిలో రెండుసార్లు టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్!

Students

Board Exams Twice a Year | పదో తరగతి, ఇంటర్‌ బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు.

టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. 2025-26 అకడమిక్ ఈయర్ నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం పీఎం శ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోర్డు పరీక్షలపై ఈ ప్రకటన చేశారు.

2020లో రూపొందించిన కొత్త జాతీయ విద్యా విధానంలో  విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం ఒకటని, ఈ క్రమంలో విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు రెండుసార్లు 10, ఇంటర్‌ విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. 

You may also like
‘విమానం దారి మళ్లింపు..ఢిల్లీ విమానాశ్రయం సీఎం పై ఆగ్రహం’
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions