Thursday 13th February 2025
12:07:03 PM
Home > తాజా > వరద నీటిలో బైక్ పై వెళ్తున్న జంట..రెచ్చిపోయిన ఆకతాయిలు |

వరద నీటిలో బైక్ పై వెళ్తున్న జంట..రెచ్చిపోయిన ఆకతాయిలు |

Viral News | వరద నీటిలో బైక్ మీద వెళ్తున్న ఓ జంటపై కొందరు ఆకతాయి యువకులు రెచ్చిపోయారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) రాజధాని లక్నో ( Lucknow ) లో చోటుచేసుకుంది.

లక్నో లోని తాజ్ హోటల్ వంతెన కింద భారీ వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు చేరుకుంది. అయితే ఈ వరద నీటిలోకి కొందరు పోకిరీలు చేరి వాహనదారులు ఇబ్బందులకు గురి చేసారు.

బైక్ ( Bike ) పై వస్తున్న ఓ జంటపై బురద నీటిని చల్లుతూ, వెనకాల కూర్చున్న మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దింతో సదరు జంట వరద నీటిలో పడిపోయింది. ఇది గమనించిన పోలీసులు అక్కడికి చేరుకొని అల్లరి మూకను చెదరగొట్టి, బాధితులను అక్కడి నుండి పంపించారు.

అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ ( Viral ) గా మారింది. జంటపై వరద నీరు చల్లుతూ వికృతానందం పొందిన పోకిరీలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు పోకిరీలపై కేసును నమోదు చేసి, వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

You may also like
modi
మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని మోదీ!
ktr
రాహుల్ గాంధీ పేరు అలా పెట్టుకుంటే బాగుంటుంది: కేటీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్.. నోటీసులు ఇచ్చిన అసెంబ్లీ కార్యదర్శి!
రూ.299 క్రెడిట్ కార్డు లావాదేవీ మర్చిపోయాడు..ఇప్పుడు రూ.22 లక్షల బిల్లు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions