Saturday 8th August 2026
12:07:03 PM
Home > తాజా > జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!

జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!

TGSPDCL FIELD WORKERS

TGSPDCL Field Workers | తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో జాతీయ రహదారులపై కూడా వరద రావడంతో రెండు రాష్ట్రాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రధాన పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలోని అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వరద బాధితులకు వీలైనంత వరకు త్వరితగతిన సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా TGSPDCL తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జోరు వర్షంలోనూ ఇద్దరు కార్మికులు స్తంభాలు ఎక్కి విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్న వీడియోను TGSPDCL షేర్ చేసింది.

క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు మా ఫీల్డ్ వర్కర్ల అంకితభావానికి వందనం అంటూ సంస్థ పోస్ట్ చేసింది. వర్షంలో మీ నిబద్ధతకు హాట్సాఫ్ అంటూ ట్వీట్ చేసింది.   

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions