Sunday 3rd May 2026
12:07:03 PM
Home > తాజా > చిన్నారులకు ఆ దగ్గు మందు వాడకండి..ప్రభుత్వ హెచ్చరికలు

చిన్నారులకు ఆ దగ్గు మందు వాడకండి..ప్రభుత్వ హెచ్చరికలు

Telangana DCA issues public alert against Coldrif syrup linked to child deaths | కోల్డ్రిఫ్ దగ్గు మందును తెలంగాణ ప్రభుత్వం నిషేదించింది. ఈ దగ్గు మందు వాడడం మూలంగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 14 మంది చిన్నారులు మరణించడం కలకలం రేపింది.

ఈ నేపథ్యంలో అప్రమత్తం అయిన రాష్ట్ర ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు నియంత్రణ సిరప్ ను నిషేధించింది. ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నంబర్ ఎస్ఆర్-13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని, హాస్పిటల్స్, మెడికల్ షాపులు విక్రయించకూడదని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఈ దగ్గు మందు తీసుకున్న 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దగ్గు మందును సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ దగ్గు మందు తయారు చేస్తున్న తమిళనాడు కాంచీపురం జిల్లా సుంగువర్చతిరాంలోని శ్రీసన్ ఫార్మా కంపెనీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యూనిట్ లో తయారైన కోల్డ్రిఫ్ సిరప్ ను పరీక్షించగా అందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితం.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions