Tuesday 17th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మాచెర్లలో ఈవీఎం ధ్వంసం.. వైసీపీ పై టీడీపీ ఫైర్!

మాచెర్లలో ఈవీఎం ధ్వంసం.. వైసీపీ పై టీడీపీ ఫైర్!

tdp ycp

EVMs Destructions | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) సమయంలో మాచెర్ల (Macherla) నియోజకవర్గంలోని పాల్వా గేట్ (Palwa Gate) పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం మెషీన్ (EVM Machine) ధ్వంసం చేసిన వీడియో మంగళవారం బయటకు రావడం పెను కలకలం రేపుతోంది. ఈ క్రమంలో వైసీపీ పై నిప్పులు చేరిగింది టీడీపీ. ” ప్రజలు తమకు ఓట్లు వేయటం లేదని, జగన్ చేయని పాపం లేదు.

పోలింగ్ జరిగిన రోజు, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202), ఏకంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.

ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క మారణహోమం చేసి, ఏమి తెలియనట్టు జగన్ రెడ్డి దేశం దాటి పోతే, ఈ పిల్ల సైకోలు రాష్ట్రం దాటి పారిపోయారు.‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తరువాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు.” అని టీడీపీ హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions