Saturday 27th July 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దేశం చూపు మొత్తం బాబు వైపే.. ఢిల్లీకి టీడీపీ అధినేత, పవన్!

దేశం చూపు మొత్తం బాబు వైపే.. ఢిల్లీకి టీడీపీ అధినేత, పవన్!

Chandrababu, Pawan Kalyan

Chandrababu and Pawan | సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా 2014, 19 లో లాగా బీజేపీ సొంతగా మెజారిటీ సాధించలేదు. అయినప్పటికీ ఎన్డీయే కూటమి మెజారిటీ సాధించింది.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ ల మద్దతు కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరారు చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఢిల్లీ లో బుధవారం సాయంత్రం జరగనున్న ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇదిలా ఉండగా ఢిల్లీ బయలుదేరే ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, తాము ఎన్డీయే తోనే ఉంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions