Sunday 9th August 2026
12:07:03 PM
Home > తాజా > ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్ కు నోటీసులు?

ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్ కు నోటీసులు?

SIT Likely to Issue Notice to KCR in Phone Tapping Case | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ దూకుడు పెంచింది. వారం రోజుల వ్యవధిలోనే బీఆరెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలను సిట్ విచారణకు పిలిచింది. తొలుత మాజీ మంత్రి హరీష్ రావు ఆ తర్వాత బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు. తాజగా రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా సిట్ ప్రశ్నించింది. ఇకపోతే మిగిలింది బీఆరెస్ అధినేత కేసీఆర్.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు జారీ సూచనలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. నేడో రేపో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తుండడం సంచలనంగా మారింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions