Friday 5th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వంగవీటి విగ్రహానికి అవమానం..చంద్రబాబు సీరియస్

వంగవీటి విగ్రహానికి అవమానం..చంద్రబాబు సీరియస్

chandra babu naidu

Cm Chandrababu News | వంగవీటి మోహనరంగా విగ్రహానికి అవమానం జరగడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో శుక్రవారం రాత్రి కొందరు దుండగులు వంగవీటి విగ్రహంపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. వంగవీటి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

విగ్రహాన్ని అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా దుశ్చర్యకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

ఈ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడేవారికి గట్టి గుణపాఠం చెప్పేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions