పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు: – మహేష్ కుమార్ గౌడ్
TG 10th Class Exams 2026 | తెలంగాణ రాష్ట్రంలో రేపటి (శనివారం) నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రస్థానంలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకమైన మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.
ఆత్మవిశ్వాసమే విజయరహస్యం
పరీక్షల పట్ల విద్యార్థులు ఎటువంటి భయం లేదా ఆందోళనకు లోనుకావద్దని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. “ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కొని ప్రశాంత చిత్తంతో సమాధానాలు రాయాలి. క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు” అని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ పరీక్షల్లో విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించి, ఉన్నత స్థానాలకు చేరుకోవడం ద్వారా రాష్ట్రానికి మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.






