Saturday 28th February 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మొంథా తీరం దాటింది ఇక్కడే !

మొంథా తీరం దాటింది ఇక్కడే !

Cyclone Montha | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆ తర్వాత తుఫాన్ గా మారి ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకువచ్చింది. దీనికి ‘మొంథా’ అని నామకరణం చేశారు. మొంథా ధాటికి ఏపీలోని తీర ప్రాంతాల్లో తీవ్ర అలజడి నెలకొంది.

ఈదురుగాలులు, భారీ వర్షాలు, రాకాసి అలలు ఇలా మొంథా బీభత్సం సృష్టించింది. ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి 11.30 నిమిషాల నుంచి 12.30 నిమిషాల మధ్య పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద భయంకర మొంథా తీరం దాటింది. ఈ విషయాన్ని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం మధ్యాహ్నం నాటికి భూభాగం పైనే ఈ తుఫాన్ బలహీనపడనుంది.

ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ఛత్తీస్ ఘడ్ చేరుకోనున్న మొంథా క్రమంగా బలహీన పడనుంది. తీరం దాటే సమయంలో మొంథా గంటకు 12 కి.మీ. వేగంతో ముందుకు సాగింది. ఈ సమయంలో 80 నుంచి 95 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తీరం దాటినప్పటికీ మొంథా ప్రభావం మూలంగా ఏపీతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి.

You may also like
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!
GHMC చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
బల్కంపేట ఆలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ..అధికారులపై వేటు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions