CM Revanth Reddy offers prayers at Khairatabad Ganesh | హైదరాబాద్లో 1 లక్షా 40 వేల విగ్రహాలను ప్రతిష్టించుకుని ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నగర చరిత్రలో గడిచిన 71 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు, కష్టాలొచ్చినా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలను జరుపుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులను అభినందించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నట్లు చెప్పారు. భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా నగరంలో పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఇతర శాఖలు తోడ్పాటును అందిస్తున్నాయన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందనని సీఎం హర్షం వ్యక్తం చేశారు.










