Wednesday 15th April 2026
12:07:03 PM
Home > తాజా > నిమజ్జనం స్పెషల్..హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

నిమజ్జనం స్పెషల్..హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్

Hyderabad Metro Extends Services for Ganesh Immersion | హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు ఘనంగా జరగనున్నాయి. నగరం వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రతిష్టించిన గణనాథులు 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకుని శనివారం నిమజ్జనానికి బయలుదేరానున్నారు.

శనివారం హైదరాబాద్ వ్యాప్తంగా కోలాహలం నెలకొననుంది. సుమారు 40 లక్షల మంది భక్తులు గణేశుడి శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో భక్తులకు తీపి కబురు అందించింది.

శనివారం ఉదయం ఆరు గంటల నుంచి మొదలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా మెట్రో రైళ్లు నడుస్తాయని ప్రకటించింది. నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడానికి భక్తులు వివిధ ప్రాంతాలకు వెళ్తారు. ఈ క్రమంలో వారు సురక్షితంగా, వేగంగా గమ్యాన్ని చేరుకోవడానికి మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions