Deputy CM Pawan Kalyan sends sarees to widowed women as a Rakhi gifts | రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని వితంతు ఆడపడుచులకు కానుకలు పంపారు స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
పిఠాపురానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు జనసేన నేతలు, కార్యకర్తలు చీరలు పంపిణీ చేశారు. రాఖీ పౌర్ణమి కానుక పంపినందుకు పవన్ కు ఆడపడుచులు ధన్యవాదాలు తెలిపారు.
వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వితంతువులకు సోదరుడిగా తాను ఉన్నాను అనే భరోసా కల్పించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం నింపేలా, ప్రతి ఆడపడుచునూ గౌరవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆయన స్థానిక నాయకులకు ఆదేశించారు.
పిఠాపురం శాసన సభ్యుడిగా మాత్రమే కాకుండా, ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా ఈ కానుకలు పంపినట్టు తెలిపారు.










