Monday 12th January 2026
12:07:03 PM
Home > క్రీడలు > ENG vs IND మూడవ టెస్టు..ఇంగ్లీష్ జట్టులోకి డేంజరస్ బౌలర్

ENG vs IND మూడవ టెస్టు..ఇంగ్లీష్ జట్టులోకి డేంజరస్ బౌలర్

Jofra Archer set to play a Test after four years | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్-టీం ఇండియా మధ్య ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ కొనసాగుతున్న విషయం తెల్సిందే.

తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించగా, రెండవ మ్యాచులో టీం ఇండియా సత్తా చాటింది. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లండన్ లోని ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభం కానున్న మ్యాచు కోసం ఇంగ్లాండ్ జట్టు సిద్దమయ్యింది.

ఈ మేరకు ప్లేయింగ్ లెవన్ ను ఆ జట్టు ప్రకటించింది. జోష్ టంగ్ స్థానంలో సీనియర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా ఎడ్జ్ బాస్టన్ టెస్టులో ఆడిన టీంతోనే ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. 2019లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులోనే ఆర్చర్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అతడు చివరగా 2021లో భారత్ పై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాల బారిన పడడం, ఫిట్నెస్ సమస్యలతో టెస్టులకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఈ టెస్టు మ్యాచుతో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions