Thursday 17th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలి’

‘ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలి’

MLC Kavitha News Latest | ఆంధ్రప్రదేశ్ లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

ఈ మేరకు హైదరాబాద్ లో ఆమె ‘పోలవరం, తెలంగాణపై జల ఖడ్గం’ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జూన్ 25న ప్రధాని మోదీ ‘ప్రగతి ఎజెండా’ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారని, ఇందులో పోలవరంతో పాటు అనేక విషయాలపై చర్చించనున్నారని పేర్కొన్నారు.

ఈ మీటింగ్ లో ప్రధాని ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణ తిరిగి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కవిత సూచించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions