Monday 30th March 2026
12:07:03 PM
Home > తాజా > అల్లు అర్జున్ ఇంటి వద్ద హైటెన్షన్..విద్యార్థి సంఘాల ఆందోళన

అల్లు అర్జున్ ఇంటి వద్ద హైటెన్షన్..విద్యార్థి సంఘాల ఆందోళన

OU JAC Students Attack On Allu Arjun House | నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ నేతలు మెరుపు ఆందోళన చేపట్టారు. దింతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది.

సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నేతకు నినదించారు. కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొందరు అల్లు అర్జున్ ఇంటిపైకి రాళ్లు, టమోటాలు విసిరేశారు. దింతో ఇంట్లోని పూల కుండీలు ధ్వంసం అయ్యాయి. ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు.

విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఘటనపై ఆరా తీశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions