Political Show in Hyderabad | తెలంగాణ రాజకీయాల్లో ఈ శుక్రవారానికి ప్రత్యేక స్థానం ఉండబోతుంది. ఈ రోజు రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eatala Rajendar) తరఫున మల్కాజిగిరి లో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోదీ (Narendra Modi).
పవిత్ర రంజాన్ (Ramadan) మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం ముస్లింలకు ఎల్బీ స్టేడియం లో విందు ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ (CM Revanth Reddy).
ఇక బీఆరెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ (KCR) తనయ ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను ఢిల్లీ మద్యం స్కాం ఆరోపణలతో అరెస్ట్ చేసింది. మరోవైపు ఓ ఆధ్యాత్మిక సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం రాష్ట్రపతి ద్రౌపది (Draupadi Murmu) ముర్ము కూడా హైదరాబాద్ లో పర్యటించారు.
ఇలా ఒకవైపు రాష్ట్రపతి రాక, ప్రధాని రోడ్ షో, సీఎం రేవంత్ విందు, కవిత అరెస్ట్ తో హైదరాబాద్ లో శుక్రవారం రాజకీయం రసవత్తరంగా మారింది.