FIR Filed On Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మరియు కన్నయ్య కుమార్ లపై అస్సాం రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదయింది.
హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రభుత్వ ఆస్తిని ధ్వసం చేయడం మరియు పోలీసులపై దాడి వంటి చర్యలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు అస్సాం సీఎం హిమాంత బిశ్వాశర్మ.
Read Also: “కుర్తా చిరిగిందని సీఎంకు విరాళమిస్తే..”ఠాకూర్ సింప్లిసిటీని గుర్తు చేసిన మోదీ!
కాగా భారత్ జోడో న్యాయ యాత్ర మంగళవారం గౌహతి నగరానికి చేరుకోకుండా పెద్ద ఎత్తున బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దింతో బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ప్రవేశించకుండా షరతులు విధించామని, అయినప్పటికీ నాయకులు రెచ్చగొట్టడం తో నిర్దేశిత మార్గం కాకుండా నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేసారని ఆరోపించారు పోలీసులు